తడిసిన ప్రతి గింజను కొనాలి... మాజీ ఎంపీ వివేక్

తడిసిన ప్రతి గింజను కొనాలి... మాజీ ఎంపీ వివేక్

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుకు న్యాయం చేకూర్చాలని మాజీ ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏపీ కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించినట్లు రైతు పండించిన ప్రతి గింజల కొనుగోలు చేయాలని అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు మాదాసు వెంకటేష్, కొలనుపాక హరీష్ మండల నాయకులు ఉన్నారు.