కర్నాటకలో ఓ పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత
కర్నాటకలో ఓ పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. విజయపుర జిల్లా బస్వన్బాగేవాడీ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ సిబ్బందితోపాటు పోలీసులపైనా స్థానికులు దాడి చేశారు. ఎన్నికల సిబ్బంది కారును కూడా ధ్వంసం చేశారు. మసబినల్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ మధ్యలో వీవీప్యాట్లు, ఈవీఎలు మారుస్తున్నారని ఓటర్లు ఆగ్రహించారు.