భారత్ కు చేరుకున్న జపాన్ ప్రధాని కిషిడా

భారత్ కు చేరుకున్న జపాన్ ప్రధాని కిషిడా

రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషించడానికి జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా సోమవారం ఉదయం భారత్ కు చేరుకున్నారు. దేశ రాజధానికి చేరుకున్న కిషిడాకు ప్రధాని నరేంద్ర మోడీ తరఫున కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు.  ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘జపాన్ ప్రధానికి స్వాగతం పలకడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని మంత్రి ట్వీట్ చేశారు.