స్పీకర్పై టీడీపీ సభ్యులు దాడి చేశారు.. అడ్డుకునేందుకు వెళితే తోసేశారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే శాసనసభలో టీడీపీ సభ్యులు స్పీకరపై దాడి చేయడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తెలిపారు. చంద్రబాబు నాయుడు టీడీపీ సభ్యులతో తనపై దాడి చేయించి తన నెత్తరు కళ్ల చూశారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, అశోక్లు స్పీకర్పై దాడికి యత్నిస్తుంటే తాము అడ్డుకున్నామని చెప్పారు. తనను తోసేయడంతో కిందపడినట్టుగా చెప్పారు. ఆ తర్వాత బాలవీరాంజేయస్వామి కింపడినట్టుగా చెప్పుకొచ్చారు. సభలో దాడి చేయించింది చంద్రబాబేనని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. స్పీకర్పై టీడీపీ సభ్యుడు డోలా బాలవీరాంజనేయ స్వామి దాడి చేశారని ఆరోపించారు. అడ్డుకోవడానికి వెళితే తనపై, సుధాకర్ బాబుపై దాడి చేశారని చెప్పారు.