సిరిసిల్ల విద్యార్ధినికి నీట్ 2023-ఆల్ ఇండియా ర్యాంక్

సిరిసిల్ల విద్యార్ధినికి నీట్ 2023-ఆల్ ఇండియా ర్యాంక్

ముద్ర సిరిసిల్ల టౌన్: నీట్ 2023 పీజి ఫలితాలలో సిరిసిల్ల కి చెందిన విద్యార్థిని శ్రీపాద శ్రీజ ఆల్ ఇండియా 1409 ర్యాంక్ సాధించి నేటి పోటీ ప్రపంచం లో అమ్మాయిలు దేనిలో తక్కువ కాదు అని రుజువు చేసింది. తన విజయానికి అమ్మ రాధా, అమ్మమ్మ తాతయ్య వీర బ్రహ్మచారి, మామయ్య వెగ్గలం రాజు అందించిన ప్రోత్సాహమే ముఖ్య కారణం అని విద్యార్థిని శ్రీజ చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డా.మురళీధర్, డా.శ్రవణ్, డా.మోహనకృష్ణ, డా.బాబు, డా.చిరంజీవి విద్యార్ధిని శ్రీజ ను సన్మానించి అభినందించారు.