డిస్ట్రిబ్యూషన్ పరిశీలించిన కలెక్టర్

డిస్ట్రిబ్యూషన్ పరిశీలించిన కలెక్టర్

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శివ లింగయ్య బుధవారం పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సిబ్బంది మరియు ఎన్నికల ఈవిఎంలు ఇతర ఎన్నికల సామగ్రి పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించి రేపు పోలింగ్ పూర్తి చేసుకుని తిరిగి రేసిప్షన్ కేంద్రానికి తిరిగి చేరుకునేందుకు తగిన సలహాలు సూచనలు జారీ చేసినారు. ఆయన వెంట ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రవీష్ గుప్త (ఐఎఎస్) రిటర్నింగ్ అధికారి రామ్మూర్తి, తహసిల్దార్ వెంకటేశ్వర్లు మైక్రో అబ్జర్వర్ లకు ఎన్నికల పోలింగ్ జరుగు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని తగు సూచనలు జారీ చేసినారు.