అడ్డదారిలో గెలిచిన కడియం - ఇందిర ధ్వజం

అడ్డదారిలో గెలిచిన కడియం - ఇందిర ధ్వజం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: అడ్డదారిలో గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని అడ్డగోలు గా మాట్లాడడం సరికాదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర ధ్వజమెత్తారు. సోనియా గాంధీ 77 వ జన్మదిన వేడుకలను జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని బస్ స్టేషన్ లో శనివారం పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతుంది అన్నారు.

ప్రజల చేతిలో తిరస్కరింపబడి, అధికారాన్ని కోల్పోయిన యావతో కడియం శ్రీహరి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేయడాన్ని ప్రజలు తిప్పి కొడతారు అన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి, జడ్పిటిసి మారపాక రవి, మాజీ జెడ్పిటిసి గుర్రం యాదగిరి, మహిళ మండల అధ్యక్షురాలు జోత్స్న, నాయకులు జగదీష్ రెడ్డి, దిలీప్ రెడ్డి, బొందయ్య, శ్రీరాములు, వెంకటయ్య, ఎల్లయ్య, నీల రాకేష్, మంద రమేష్, కోళ్ల రవి, నక్క పాపయ్య, లింగోజి, మారపాక ఏలియా, మార్కు శ్రీనివాస్, కోరుకొప్పుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 6 గ్యారంటీలో ఒకటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంలో భాగంగా పలువురు మహిళలతో కలిసి ఆమె ఆర్టీసీ బస్సులో రఘునాధపల్లి వరకు ఉచిత ప్రయాణం చేశారు.