జడ్పీ చైర్మన్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ఆరూరి పరామర్శ

జడ్పీ చైర్మన్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ఆరూరి పరామర్శ

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: గుండెపోటుతో ఇటీవల మరణించిన జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి కుటుంబాన్ని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరామర్శించారు. చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, చాగల్ సర్పంచ్ పోగుల సారంగపాణి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయక్, పాగాల శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, శ్యాం కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.