మార్కెట్ చైర్మన్ ను సన్మానించిన సుల్తాన్ రాజ్

మార్కెట్ చైర్మన్ ను సన్మానించిన సుల్తాన్ రాజ్

ముద్ర, జనగామ టౌన్ : జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా నియామకమైన బాల్దే సిద్దిలింగం జిల్లాకు చెందిన ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలిశారు. ఉదయం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తో పాటు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ కార్యదర్శి సుల్తాన్ రాజ్ ను కలిశారు. పట్టణంలోని కేకే హాస్పిటల్ కు వచ్చిన సిద్దిలింగంకు సుల్తాన్ రాజ్ బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. రాబోయే రోజుల్లో సిద్దిలింగం మరి ఉన్నత పదవులు చేపట్టాలని సుల్తాన్ రాజ్ ఆకాంక్షించారు కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు, కేకే హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.