మీకు ప్రభుత్వ అండ ఉంటుంది

మీకు ప్రభుత్వ అండ ఉంటుంది
  • బిఆర్ఎస్ అభ్యర్థి కడియం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ఎన్నికల్లో మీరు తోడుగా ఉంటే ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని టిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రం ఈఆర్ఎల్ గార్డెన్లో భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రీహరి మాట్లాడుతూ రూ. 1 లక్ష 30 వేల ప్రమాద బీమా ను రూ. 6.30 వేలకు, సాధారణ మరణాలకు రూ. 1.30 వేలు చేసిన గణత టిఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం కార్మికులకు శిక్షణ ఇచ్చి, గుర్తింపు కార్డులు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. మూడోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కార్మికులందరికీ పూర్తి సబ్సిడీపై మోటార్ సైకిల్ అందజేస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏడు మండలాల్లో భవన నిర్మాణ కార్మికుల కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామన్నారు. ఇండ్లు లేని పేద కార్మికులకు వెయ్యి ఇల్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని అందుకు మీ సహకారం ఉండాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎస్ కే అలీ, సంపత్, కుమారస్వామి, కొమరయ్య, యాదగిరి, రామస్వామి, లక్ష్మయ్య, తాటికొండ మధు టిఆర్ఎస్ నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బెల్దే వెంకన్న, మారుజోడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.