కుందారలో రోడ్డు ప్రమాదం

  • ఒకరు మృతి, నలుగురికి గాయాలు

ముద్ర ప్రతినిధి, జనగామ :జనగామ జిల్లా లింగాలగణపురం మండలం కుందారం కెనాల్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్వంచ నుంచి హైదరాబాదుకు వెళుతున్న ఎర్టిగా వాహనం కుందారం వద్ద చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికుల్లో నలుగురికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు.