దున్నపోతుకు జిపి కార్మికుల వినతి

దున్నపోతుకు జిపి కార్మికుల వినతి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: గత 22 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం జిపి కార్మికులు దున్నపోతుకు వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో  జేఏసీ మండల అధ్యక్షుడు కందాలోజు రాజు, కార్యదర్శి రావుల జగన్నాథం, మండల నాయకులు సింగపురం కుమార్, గాదరి యాకూబ్, మారపాక దేవయ్య, బొమ్మ గళ్ళ కుమారస్వామి, ఇస్లావత్ రాజశేఖర్, చేపూరి లక్ష్మి,  గుండె లక్ష్మి, మేడ కోమల, గుర్రం లక్ష్మి, గోవింద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.