లోక్ అదాలత్ను సక్సెస్ చేయాలి
ముద్ర ప్రతినిధి, జనగామ : జూన్10న జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ డి.రవీంద్రశర్మ కోరారు. ఈ మేరకు గురువారం జనగామ కోర్టు న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న క్రిమిల్, సివిల్, వివాహ సంబంధ కేసులు, చిట్ ఫండ్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. జనగామ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పడిన తర్వాత లోక్ అదాలత్ నిర్వహించడం ఇది రెండో సారి అని తెలిపారు. సమావేశంలో జనగామ బార్ అసోషియేషన్ ప్రెసిడెంట్ కురెల్ల శ్రీనివాస్రెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.