అదనపు కలెక్టర్ విస్తృత పర్యటన

అదనపు కలెక్టర్ విస్తృత పర్యటన

ముద్ర ప్రతినిధి, జనగామ జనగామ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్ మంగళవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. లింగాలఘణపురం మండలం నవాబుపేటలో ప్లాంటేషన్ ను పరిశీలించారు. నర్మెట మండలం బొమ్మకూరు, జనగామ పట్టణంలో సంపద వనాలను పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన నిబంధనల ప్రకారం లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బొమ్మకూరులో అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు.

పిల్లలకు అందుతున్న పౌష్టిక ఆహారం గురించి కేంద్రం సూపర్ వైజర్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న గ్రుడ్లు, వివిధ సామగ్రిని ఆయన పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆయన వెంట డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రజిత, లింగల ఘనపూర్, నర్మెంట, ఎంపీడీవోలు సురేందర్, కాజా మోహినుద్దీన్ తదితరులు ఉన్నారు.