అభివృద్ధిని కొనసాగించాలి - మాజీ మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి ముద్ర: గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తుత ఎమ్మెల్యే యశస్విని కొనసాగించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. శనివారం పాలకుర్తి మండల టిఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ పాలకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన యశస్విని శుభాకాంక్షలు తెలిపారు. నేను పాలకుర్తిని వదిలి వెళ్ళేది లేదని, కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని స్పష్టం చేశారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకూడదని,, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హితువు పలికారు. సమావేశంలో ఎంపీపీ నాగిరెడ్డి, జడ్పిటిసి పుష్కూరి శ్రీనివాసరావు, నాయకులు నవీన్ కుమార్, అశోక్ రెడ్డి, పాము శ్రీనివాస్, ఎండి మదర్ ముసుకు రాంబాబు, పోశాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.