ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం

ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం

మహాదేవపూర్, ముద్ర: కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించగా బస్టాండులో స్థానిక నేతలు జండా ఊపి ప్రారంభించి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జెండా ఊపి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏఐసీసీ కార్యదర్శి, ఐటీ ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాల మంత్రి, ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచన మేరకు సోనియా గాంధి జన్మదిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్, అధ్యక్షులు కోట రాజబాబు, కటకం అశోక్, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, నాగరాజు, ఆస్రార్, మెంగానీ అశోక్, చెకుర్తి శంకర్, రాజబాబు,యువజన నాయకులు, మహిళా నాయకురాల్లు,మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ,బీసీ సెల్ కార్యకర్తలు పాల్గొన్నారు.