జిల్లా స్థాయి క్రీడలకి ఎంపికైన విద్యార్ధిని  సిరి

జిల్లా స్థాయి క్రీడలకి ఎంపికైన విద్యార్ధిని  సిరి

ముద్ర, శాయంపేట : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థినిలు జిల్లా స్థాయి క్రీడలలో పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీలలో రాష్ట్ర స్థాయి 67వ పోటీలకు ఎంపికయ్యారు. ఈ విద్యార్థినిలు,  మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో జరిగిన రాష్ట్ర స్థాయి  పోటీలలో నవ్యశ్రీ, దివ్యశ్రీ, కృష్ణవేణి, సిరి పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన జె సిరి జాతీయ స్థాయికి క్రీడలకి ఎంపికయ్యింది. విద్యార్ధి సిరిని కళాశాల ప్రిన్సిపాల్ సుభాషిణి దేవి, వైస్ ప్రిన్సిపాల్ వసంత్, పిఇటి అమృత, ఉపాధ్యాయ బృందం అభినందించారు