ఎమ్మెల్యే దంపతుల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక..

ఎమ్మెల్యే దంపతుల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలం పర్లపల్లికి చెందిన 50 మంది యువకులు ఆదివారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి దంపతుల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్, బీజేపీల నుండి బీఆర్ఎస్ లో చేరిన యువకులకు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, అభివృధ్ది చేసిన బీఅర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించి వారిని కాపాడుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జోరుక సదయ్య, సొసైటీ డైరెక్టర్ దిండ్యాల సత్యనారాయణ, సీనియర్ నాయకులు గోలి కృష్ణారెడ్డి, ఈర్ల అశోక్, గ్రామ బీఅర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.