ప్రణయ్ ఇండస్ట్రీస్ కు కోల్ ఇండియా రీసెర్చ్ అవార్డు

ప్రణయ్ ఇండస్ట్రీస్ కు కోల్ ఇండియా రీసెర్చ్ అవార్డు
  • గణపురం వాసికి అరుదైన గౌరవం.. 
  • కోల్ చైర్మన్ చేతుల మీదుగా అవార్డు ప్రధానం..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన అట్లూరి వెంకట లక్ష్మీనరసింహరావు కు అరుదైన గౌరవం దక్కింది. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఈ నెల 3న కోల్ రీసెర్చ్ విభాగంలో ఆన్లైన్ కోల్ గ్రేడ్  మానిటరింగ్ విభాగంలో మన దేశస్థాయిలో ఏవిఎల్ఎన్ రావు మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఈ బహుమతిని కోల్ సెక్రెటరీ అమ్రిత్ లాల్ మీనా ఐఏఎస్, కోల్ ఇండియా చైర్మన్, ఎండి. పీఎం ప్రసాద్ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు.  వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ప్రణయ్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న ఆయన గతంలో బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డుతో పాటు బెస్ట్ సిటిజన్ అవార్డులు పొందారు. బహుమతి అందుకున్న ఏవిఎల్ఎన్ రావుకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.