తీన్మార్ మల్లన్నపై ఎస్సైకి ఫిర్యాదు..

తీన్మార్ మల్లన్నపై ఎస్సైకి ఫిర్యాదు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వాఖ్యలు చేస్తున్న క్యూ న్యూస్ ఛానల్ చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) పై చర్యలు తీసుకోవాలని భారత జాగృతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎస్సై ప్రశాంత్ ఫిర్యాదు చేశారు.

ఈ కార్యక్రమంలొ భారత జాగృతి నాయకులు చీకటి గణేష్, సందీప్ గౌడ్, తుండ్ల గణేష్, సాయికుమార్, బద్దెల వంశీ, రాజుకుమార్, బొడ్డు సాయి, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.