అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యం..

అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యం..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:గ్రామాలను అభివృద్ధి చేయడం, ప్రజల సంక్షేమానికి పాటుపడడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జడల్ పేట లో రూ.50లక్షలతో సైడ్ డ్రైన్ పనుల నిర్మాణం, రామచంద్రపురంలో రూ.10లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, నవాబుపేటలో రూ.10లక్షలతో సీసీ రోడ్లు, రూ.50లక్షలతో సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే చేతులమీదుగా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద, జడ్పిటిసి గొర్రె సాగర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కామిడీ రత్నాకర్ రెడ్డి, సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధ, అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.