ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి..

ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి..
  • గండ్ర సత్యనారాయణ రావు

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో సోమవారం సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేపట్టగా, గండ్ర సత్యనారాయణరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్ల కు రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి హెల్త్ కార్డులు అందించి, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని, పని భారం తగ్గించి జాబ్ చార్జీలను విడుదల చేయాలన్నారు. ఆశా వర్కర్ల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని ఆయన తెలిపారు.