సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి.. 

సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి.. 
  • శాఖల వారిగా కార్యాలయాలు సిద్ధం చేసుకోవాలి..
  • జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ నూతన కార్యాలయ పనులు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. నూతన కలెక్టరేట్ భవనంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మాణం పూర్తి అయినందున వివిధ శాఖల అధికారులు తమ శాఖల ఆఫీసులను సిద్ధం చేసుకోవాలని కోరారు. తమకు కేటాయించిన కార్యాలయాల్లోకి సామగ్రిని తరలించి, సర్దుకునే చర్యలు తీసుకోవాలని, సహాయం కోసం వచ్చిన ప్రతి సామాన్యుడు సంతృప్తి చెందేలా అన్ని కార్యాలయాల ఏర్పాటు జరగాలని సూచించారు.అక్టోబర్ మొదటి వారంలో సిఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నందున అందుకు అన్ని శాఖల జిల్లా అధికారులు అన్నివిధాలా కార్యాలయాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.