బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి - గండ్ర జ్యోతి

బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి - గండ్ర జ్యోతి

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆదరించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచినిపర్తి, చల్లగరిగ, జూకల్, గుంటూరుపల్లి, తిర్మలాపురం, చిట్యాల, కైలాపూర్, చింతకుంటరామయ్యపల్లి, రామచంద్రాపురం తదితర గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆమె చెప్పారు. అనంతరం వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.