కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిక..

కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిక..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీని వీడి గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి గౌతమ్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీ ఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పార్టీలో చేరిన వారిలో రవి, మహేందర్, కొండయ్య, పంజాల సారయ్య, పంజాల రాజయ్య, దామెర సధాకర్, తాడవేన సంతోష్, దుస్సా కళ్యాణ్, నరేందర్, గంపల పవన్, గంపల శేఖర్, బొజ్జపల్లి మణిష్, టర్రె అనిల్, అంబాల లడ్డు, బొజ్జపల్లి శంకర్, చిట్యాల వెంకటేష్, మిట్టపల్లి అనిల్, దారా శంకర్, దారా రత్నకర్, గంపల శంకర్, దుస్సా రవి, కట్ల రమేష్, దార శేషు, రాసల చిన్న కొంరయ్య, మిట్టపల్లి సమ్మయ్య తదితరులు ఉన్నారు.