రైతుబంధు జిల్లా డైరెక్టర్ గా బత్తిని శ్రీహరి గౌడ్ - సన్మానిస్తున్న గౌడ సంఘం నాయకులు

రైతుబంధు జిల్లా డైరెక్టర్ గా బత్తిని శ్రీహరి గౌడ్  - సన్మానిస్తున్న గౌడ సంఘం నాయకులు

ముద్ర, మొగుళ్లపల్లి: రైతుబంధు జిల్లా డైరెక్టర్ గా  బత్తిని శ్రీహరి గౌడ్ నియమితులైనారు. ఈ సందర్భంగా గౌడ సంఘం మొగుళ్ళపల్లి గ్రామ సొసైటీ అధ్యక్షుడు బత్తిని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని బత్తిని శ్రీహరి గౌడ్ నివాసంలో గౌడ సంఘం నాయకులు కలిసి ఆత్మీయంగా శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జై గౌడ్ ఉద్యమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్ మాట్లాడుతూ..బత్తిని శ్రీహరి గౌడ్ గత 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో బహుజన వాదాన్ని బలపరుస్తూ.. మొగుళ్లపల్లి మండలంలో అత్యధిక సంఖ్యలో బీసీలను గెలిపించేందుకు కృషి చేసేవారని, మొగుళ్ళపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గా ప్రజలకు విశేష సేవలందించిన, ఆయన  సేవా తత్వాన్ని గుర్తించి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బత్తిని శ్రీహరి గౌడ్ ను రైతుబంధు జిల్లా డైరెక్టర్ గా నియమించినందుకు మహేందర్ గౌడ్ గౌడ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన గౌడ కులస్తులకు మరిన్ని పదవులు ఇచ్చి గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమ యువజన సంఘం  జిల్లా అధ్యక్షుడు వేముల కిరణ్ గౌడ్, వార్డు సభ్యుడు బత్తిని నరహరి గౌడ్, గౌడ సంఘం నాయకులు వడ్లకొండ పవన్ గౌడ్, శ్రీపతి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.