ఆత్మీయ మిత్రుడిని ఘనంగా సన్మానిస్తున్న నవత వెంకన్న

ఆత్మీయ మిత్రుడిని ఘనంగా సన్మానిస్తున్న నవత వెంకన్న

మొగుళ్లపల్లి, ముద్ర: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత..బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కోడారి రమేష్ యాదవ్ ఇటీవలే చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలను చేపట్టారు. కాగా కోడారి రమేష్ యాదవ్ తెలంగాణ రైతు విమోచన రాష్ట్ర చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్ రావు ( నవత వెంకన్న) ను గురువారం హన్మకొండలోని తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలువగా..ఆత్మీయ మిత్రుడిని నవత వెంకన్న శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నవత వెంకన్న మాట్లాడుతూ..ప్రత్యేక రాష్ట్ర  సాధన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ ఆదరించి అక్కున చేర్చుకుంటుందన్నారు. కోడారి రమేష్ యాదవ్ మున్ముందు మరింత ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.