మీ గ్రామ అభివృద్ధి నా బాధ్యత.
- మళ్ళీ ఆశీర్వదించండి.
- బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి - రమణా రెడ్డి
శాయంపేట,ముద్ర :మండలంలోని పత్తిపాక గ్రామంలో సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో బిఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణరెడ్డి, వరంగల్ జడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి రమణారెడ్డి మాట్లాడుతూ...
మీ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసానని అన్నారు.మన ఊరి మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాల ని అభివృద్ధి చేసానని, ఒక మాడల్ స్కూల్ లాగా చేశామని చెప్పారు. మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలని కోరారు.
గండ్ర జ్యోతి మాట్లాడుతూ...
పత్తిపాక గ్రామంలో ఎమ్మెల్యే రమణారెడ్డి సహకారoతో పద్మశాలి కమ్యూనిట్ హాల్ నిర్మాణం చేసుకుంటున్నాం.ముదిరాజ్ కమ్యూనిటి హాల్ నిర్మాణం చేసుకుంటున్నాం.ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం కూడా పూర్తిచేసుకున్నామని చెప్పారు.అభివృద్ధి చేసే బిఆర్ఎస్ కే, మరొకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.30 తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేసి రమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్యకార్యకర్తలు, బిఆర్ఎస్ నాయకులు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు