సెప్టెంబర్ 2న కోడారి రమేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం
మొగుళ్లపల్లి, ముద్ర :తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన యువనేత..మొగుళ్ళపల్లి గడ్డపై బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మలిచిన ఉద్యమ నేత కోడారి రమేష్ యాదవ్ ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియమితులైనారు. ఆయనతో పాటు నూతనంగా నియమితులైన డైరెక్టర్లు సెప్టెంబర్ 2న చిట్యాల మార్కెట్ యార్డులో ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి లు హాజరవుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కావున భూపాలపల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారులు విజ్ఞప్తి చేశారు.