అన్నదాతకు అందుబాటులో ఉండూ
![అన్నదాతకు అందుబాటులో ఉండూ](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64ef22504b713.jpg)
- ఏఎంసీ చైర్మన్ కు సన్మానం
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య
ముద్ర, ఎల్లారెడ్దిపేట :అన్నదాతకు అందుబాటులో ఉండి విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేయాలని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ ఏఎంసీ చైర్మన్ గా ఎన్నికైన ఎలుసాని మోహన్ కుమార్ ను మంగళవారం రాత్రి జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో రైతులు పంటలను సాగు చేసి ధాన్యం విక్రయించే వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతగా పనిచేయాలని అన్నారు. వ్యవసాయ రంగంలో ఏఎంసీ చైర్మన్ ల పాత్ర కీలకమన్నారు. అదేవిధంగా రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వీర్నపల్లి ఏఎంసీ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి, జెడ్పి కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ చాంద్ పాషా, మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.