సెస్ అధికారుల నిర్లక్ష్యం

సెస్ అధికారుల నిర్లక్ష్యం
  • హై వోల్టేజ్ విద్యుత్ తో షార్ట్ సర్క్యూట్
  • 40 ఇండ్లలో టీవీలు ఫ్రిజ్లు కూలర్లు కాలిపోయాయి 

ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా   ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హై స్కూల్ ఏరియాలో ట్రాన్స్ ఫర్ వోల్టేజ్ ఎక్కువ అవ్వడంతో రాత్రి ఉరుములకు ఏరియా లో ఉన్న 40 ఇండ్లలో షార్ట్ సర్క్యూస్  వల్ల ఇండ్ల లో ని టీవీలు,ఫ్యాన్స్,కూలర్స్ కాలిపోవడం జరిగింది.కాలనీవాసులు బాధ రమేష్ కొన్నే పోచయ్య, కొన్నే మల్లయ్య,దీటి మురళి, వీరమ్మ గారి అరుణ్, పోతనపేట దేవయ్య, ఏరియాలో రెండోసారి నష్టం జరిగిందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నష్టపరిహారం ఇవ్వాలని  వార్డు సభ్యులు  పందిర్ల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోమాటి  నరసయ్య,కార్యదర్శి పందిర్ల లింగం,పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, గంట బుచ్చయ్య, గుండాడి రాంరెడ్డి,బిపట రాజు.పాల్గొన్నారు.