కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. 

కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. 
  • 6 గ్యారంటీల అమలు ఖాయం..
  • గండ్ర సత్యనారాయణ రావు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేయడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని నర్సింగాపూర్, వేములపల్లి, కాసులపహాడ్ గ్రామాలలో సోమవారం గండ్ర సత్యనారాయణ రావు ప్రజా దీవెన యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దీవెనలు ఇచ్చి, గెలిపించాలని కోరారు. గెలిచిన తరువాత భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు పాలేరు కన్నా మిన్నగా సేవ చేస్తానని, భూపాలపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఈ ప్రభుత్వం ఏ రోజు పట్టించుకోలేదని విమర్శించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అన్నివర్గాల ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ కు పట్టం కట్టాలని పిలుపు నిచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జీఎస్సార్ ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో రూపొందించిన కరపత్రాన్ని ప్రజలకు అందించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.