కన్నతల్లిని కడతేర్చిన కొడుకు

కన్నతల్లిని కడతేర్చిన కొడుకు

రోకలి బండతో కొట్టడంతో అక్కడిక్కడే మృతి
అడ్డు వచ్చిన మరో మహిళపై దాడి
భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి గ్రామంలో ఘటన

రేగొండ, ముద్ర : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. తల్లిని కొడుకు గొడ్డలితో నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో మతిస్థిమితం లేని కొడుకు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. గ్రామానికి చెందిన కంచరకుంట్ల రాజిరెడ్డి మతిస్థిమితం సరిగా లేదు.  ఈక్రమంలో గురువారం అర్ధరాత్రి  ఒంటిగంట సమయంలో తల్లి కంచరకుంట్ల హైమావతిని గొడ్డలితో నరికి అతికిరాతకంగా హత్య చేశాడు.  గొడవను చూసి ఇంటి పక్కన ఉన్న ఊకంటి లలిత అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె పై దాడి చేశాడు. చికిత్స నిమిత్తం లలితను ఎంజీఎంకు తరలించగా పరిస్థితి విషమంగా ఉంది.

దాడి చేసిన అనంతరం పారిపోతుండగా.. గోరుకొత్తపల్లి మండలం చిన్నకోడపాక గ్రామంలో రాజిరెడ్డి అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి భూపాలపల్లి డీఎస్పీ రాములు, చిట్యాల సిఐ వేణుచందర్, రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. విచారణ చేపట్టారు. మృతురాలి సోదరుడు మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.