ఆలయాలను సందర్శించిన టీటీడీ అధికారి

ఆలయాలను సందర్శించిన టీటీడీ అధికారి

ముద్ర, మల్యాల: మండలంలొని ఆయా గ్రామాల్లో గల పలు దేవాలయాలను గురువారం టీటీడీ పర్యవేక్షకులు డాక్టర్ రంగనాథo సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అభివృద్ధికి నోచుకోని ఆలయాల అభివృద్ధికి నిధుల మంజూరుకై ఆయన ఆలయాలను సందర్శించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

కాగా, ముత్యంపేట శివారులోని ఆది పెరుమాoడ్ల స్వామి ఆలయానికి టీటీడీ నుండి రూపాయలు 10 లక్షలు మంజూరు కాగా, స్థానిక సర్పంచ్ బద్ధo తిరుపతి రెడ్డితొ కలిసి ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానికులు ఆయనకు, నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలొ జడ్పీటీసీ రామ్మోహన్ రావు, ఉపసర్పంచ్ త్రినాథ్, బోడ గోవర్ధన్, తాటిపాముల జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.