ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి :ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి  జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం  జిల్లా కలెక్టరేటు సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన 21 ఫిర్యాదులను స్వీకరించారు.ఇందులో రెవెన్యూ శాఖ 14, ఎంప్లాయిమెంట్   శాఖ 3,  పంచాయతీరాజ్, విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, చేనేత శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి పద్మజారాణి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.