కేటీపీపీ లో రూ. కోటి విలువైన సామాగ్రి మాయం..?

కేటీపీపీ లో రూ. కోటి విలువైన సామాగ్రి మాయం..?
  • ఇంటి దొంగల పనేనా..
  • అంతర్గతంగా విచారణ..  

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)లో దొంగలు పడ్డారు. రూ. కోటి విలువైన సామాగ్రి మాయమైనట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. కేటీపీపీ లోని స్టోర్ రూంలో నిల్వ ఉన్న కాపర్ వైరు భారీగా మాయం అయినట్లు తెలుస్తోంది. స్టోర్ లో కాపర్ వైరుతో పాటు విలువైన సామాగ్రి కనిపించడం లేదని సోమవారం సిబ్బంది గుర్తించారు.

ఈ విషయం జెన్ కో ఉన్నతాధికారులకు తెలియడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. విషయం బయటికి పోక్కకుండా.. జెన్ కో అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. విలువైన సామాగ్రి మాయం కావడం ఏంటి.. అంత సెక్యూరిటీ ఉన్న కేటీపీపీ లో సామాగ్రి ఎలా మాయమైందనే విషయంపై కూపీ లాగుతున్నారు. ఇంతలోనే ఈ విషయం జెన్ కో సీఎండీ కి తెలియడంతో స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.