గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి

మహాదేవపూర్, ముద్ర: ఎన్కపల్లి అడవిలో రహస్యంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ స్థావరంలో 4వేల మీటర్ల కుటుంబాన్ని ధ్వంసం చేయడంతో పాటు 50 లీటర్ల కుటుంబాలు స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా కాయడానికి ఉపయోగించే వస్తువులన్నింటినీ పోలీసులు ధ్వంసం చేశారు. గుడుంబా బట్టీలను నిర్వహిస్తున్న కొర్లకుంట గ్రామానికి చెందిన ఇద్దరిపై మరియు ఎన్కపల్లి గ్రామానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాజకుమార్ తెలిపారు. రాబోయే ఎన్నికల సందడి నేపథ్యంలో అనేకమంది గుడుంబా బట్టిలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.