దేవీ నవరాత్రి ఉత్సవాల్లో కాంగ్రెస్ నేత గండ్ర పూజలు.. 

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో కాంగ్రెస్ నేత గండ్ర పూజలు.. 

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:భూపాలపల్లి పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని థౌసండ్ క్వార్టర్స్, కేటికే 8 ఇంక్లైన్, సుభాష్ కాలనీ , 1ఇంక్లైన్ లలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జరుగుతున్న పూజల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు, ఆయన సతీమణి, జడ్పీటీసీ పద్మలు పాల్గొన్నారు. నిర్వాహక కమిటీలు నిర్వహించిన ఉత్సవాల్లో గండ్ర దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.