అన్నదానం చేసిన ‘ఆరుట్ల’

అన్నదానం చేసిన ‘ఆరుట్ల’

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆరుట్ల లోకమంతరెడ్డి జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి దశమంతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుట్టిన రోజు సందర్భంగా నిరాశ్రయులకు ఒక పూట ఆకలి తీర్చడం సంతోషంగా ఉందన్నారు. అమ్మ ఫౌండేషన్ ఆలోచన, ఆశయం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు మంతెన మణికుమార్, ముఖ్య సలహాదారుడు వంగ భీమ్ రాజ్, బీజేపీ నాయకులు సౌడ రమేష్, షనబోయిన సంపత్, తోకల హరీష్, శంకర్ సింగ్, ప్రజ్ఞాపురం ఆంజనేయులు, ఘనపురం కార్తీక్, చందు, కొత్త పల్లి సుధాకర్, ప్రకాష్ పాల్గొన్నారు.