రాష్ట్ర స్థాయి సెమినార్ కి ఎంపికైన వనం శ్రీవాణి

రాష్ట్ర స్థాయి సెమినార్ కి ఎంపికైన వనం శ్రీవాణి

శాయంపేట,ముద్ర: మండల శివారు ఆరేపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వనం శ్రీవాణి రాష్ట్రస్థాయి గణిత సెమినార్కు సెలెక్ట్ అయ్యింది . ప్రపంచ గణితవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవ వేడుకలలో డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం సందర్బంగా రాష్ట్ర విద్యా పరిశోధన,  శిక్షణ సంస్థ హైదరాబాదు వారు నిర్వహించే రాష్ట్రస్థాయి గణిత సెమినార్కు మన జిల్లా నుండి ఆరేపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వనం శ్రీవాణి ఎంపిక కావడం విశేషం. ఈనెల 22న ఎస్సీఈఆర్టీ హైదరాబాదులో తన యొక్క సెమినార్ పేపర్ను ప్రజెంట్ చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపికైన ఉపాధ్యాయురాలు వనం శ్రీవాణిని స్థానిక సర్పంచ్, ఉపాధ్యాయులు అభినందించారు.