నాకబలితో ముగిసిన కోటంచ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు.. చివరి రోజు పోటెత్తిన భక్తులు

నాకబలితో ముగిసిన కోటంచ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు.. చివరి రోజు పోటెత్తిన భక్తులు
Kotancha Lakshminarsimhaswamy Brahmotsavalu

ముద్ర న్యూస్ రేగొండ: రెండో యాదాద్రిగా పిలుచే జయశంకర్ జిల్లా రేగొండ మండలంలోని కోటంచ‌ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. గురువారం నాకబలి నిర్వ‌హించారు. చివరి రోజు సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.నాకబలి సందర్బంగా ఆలయంలో నాట్య కళామండలి ఆధ్వర్యంలో కళ ప్రదర్శన ఏర్పాటు చేసారు.

భక్తులు అధిక సంఖ్యలో రావ‌డంతో పోలీస్ శాఖ అప్రమత్తమై ట్రాఫిక్ ను నియంత్రించింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాధడి అనిత కర్ణాకర్ రెడ్డి, ఈఓ శ్రీనివాస్, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్, ఎంపీటీసీ ఎర్రబెల్లి రవీందర్ రావు సీఐ పులి వెంకట్, ఎస్సైలు శ్రీకాంత్ రెడ్డి, అభినవ్ చల్ల రాజు పాల్గొన్నారు.