పోలీసుల ముమ్ముర తనిఖీలు

పోలీసుల ముమ్ముర తనిఖీలు

ముద్ర న్యూస్, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్రావు మండలంలో భూపాలపల్లి-పెద్దపెల్లి జిల్లాల సరిహద్దులో కొయ్యూరు పోలీసులు ముమ్ముర తనిఖీలు చేపట్టారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు.కొయ్యూరు ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో కూలింగ్ నిర్వహించి కల్వర్టులను పరిశీలించారు.