బ్రిడ్జి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు..

బ్రిడ్జి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు..

పాలాభిషేకం చేసిన నేతలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు కాగా, నిధుల మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే, సీఎం చిత్రపటాలకు బీఆర్ఎస్ నేతలు గురువారం టేకుమట్ల మండలకేంద్రంలో పాలాభిషేకం చేశారు. టేకుమట్ల, రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య గల బ్రిడ్జి ఇటీవలె కురిసిన భారీ వర్షాల వల్ల చలివాగు ఉప్పొంగి కొంతభాగం కొట్టుకుపోయింది. అప్పటినుండి రాకపోకలు నిలిచిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిధుల మంజూరుకు కృషి చేశారు. బ్రిడ్జి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతగా టేకుమట్ల మండలకేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిల చిత్ర పటాలకు పాలభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, సర్పంచ్ లు చదవు మధుర మహేందర్ రెడ్డి, పొలాల సరోత్తం రెడ్డి, బిళ్ళకంటి ఉమేందర్ రావు, శోభ మహిపాల్ రెడ్డి, అడగాని లత రామారావు, ఎంపీటీసీ పింగిలి వెంకటశ్వర్ రెడ్డి, అది సునీత రఘు, సంగి రవి, గంధం వజ్ర సారయ్య, మండల రైతు సమితి కోఆర్డినేటర్ కూర సురేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, నాయకులు బొల్లు సరోత్తంరెడ్డి, తుమ్మెటి సురేందర్ రెడ్డి, చిలుక మల్లయ్య, కుర్రే మల్లయ్య, పసరగొండ లక్ష్మణ్, బొడ్డు సదానందం, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.