మైలారం భూములను పేదలకు పంచాలని కాంగ్రెస్ ధర్నా..

మైలారం భూములను పేదలకు పంచాలని కాంగ్రెస్ ధర్నా..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం భూములను నిరుపేదలకు పంచాలని కోరుతూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాశ్ రెడ్డి, టిపిసిసి సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావులు పాల్గొని మాట్లాడుతూ మైలారం గుట్టపై ఎమ్మెల్యే కన్నేశారని, ఆ భూమి కబ్జా కాకముందే అధికారులు చొరవ తీసుకుని నిరుపేదలకు భూములు పంచి, పట్టాలివ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చల్లూరి మధు, ఎంపీపీ కావటి రజిత రవీందర్, నాయకులు విడిదినేని అశోక్, గాంధీనగర్ సర్పంచ్ మాదం మమత సుధాకర్, గాంధీనగర్, మైలారం గ్రామ నాయకులు పాల్గొన్నారు.