చల్లగరిగలో రాములోరి అక్షింతలు పంపిణీ..

చల్లగరిగలో రాములోరి అక్షింతలు పంపిణీ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో ఆదివారం అయోధ్య రామయ్య అక్షింతలను పంపిణీ చేశారు. గ్రామంలోని శ్రీ రామాలయంలో ముందుగా అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన పవిత్ర అక్షింతలకు పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని పురవీధుల్లో మంగళ, వాయిద్యాలతో, డీజే భక్తి పాటలతో రామనామ సంకీర్తనలతో ఊరేగింపుగా ఇంటింటికి తిరుగుతూ స్థానిక రామాలయ నిర్వాహకులు అక్షింతలను పంపిణీ చేశారు. సాక్షాత్ రామయ్య తండ్రి అక్షింతలు తమ ఇంటి వద్దకు రావడంతో గ్రామస్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. టెంకాయలు కొట్టి, అక్షింతలు కళ్లకద్దుకొని స్వామివారికి నమస్కరించిన భక్తులు అక్షింతలు సంతోషంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్రె మంజుల అశోక్ రెడ్డి, భక్తులు బూర రాజు, మేరుగు సంపత్ కుమార్, కన్నెవేన రాజయ్య, తడుక సుధాకర్, నేరెళ్ల శ్రీనివాస్, పోశాల రాజు, మహిళలు పాల్గొన్నారు.