ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు దంపతులు..

ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు దంపతులు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆయన సతీమణి పద్మ(గణపురం జడ్పీటీసీ)లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారి స్వగ్రామమైన గణపురం మండలం బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 7 గంటలకు గండ్ర సత్యనారాయణ రావు తొలి ఓటును వేశారు. అనంతరం రెండో ఓటును గండ్ర పద్మ వేశారు. వారి వెంట గణపురం మండల వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ తదితరులు ఉన్నారు.