ఓటు హక్కు వినియోగించుకున్న మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుదిళ్ల శ్రీధర్ బాబు 

ఓటు హక్కు వినియోగించుకున్న మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుదిళ్ల శ్రీధర్ బాబు 

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం మంథని నియోజకవర్గంలోని తన సొంత గ్రామం భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని శ్రీధర్ బాబు ప్రజలను కోరారు.