ఓటు హక్కు పై అవగాహన ర్యాలీ

ఓటు హక్కు పై అవగాహన ర్యాలీ

మహాదేవపూర్, ముద్ర:  ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, సెర్ప్ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ఏ. రవీంద్రనాథ్ మాట్లాడుతూ18 సంవత్సరాలు పూర్తయి ఓటు హక్కు ఉన్న యువతీ యువకులు అందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.  తహసిల్దార్ లక్ష్మి రాజమ్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటు హక్కు పవిత్రమైనదని, అనుకున్న పాలన విధానం సాధించుకునే ఆయుధం అన్నారు. ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.  అనంతరం ఉద్యోగులందరూ మానవహారంగా ఏర్పడి ఓటు హక్కువినియోగించుకొంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రనాథ్, తహసిల్దార్ లక్ష్మీరాజం, మండల పంచాయతీ అధికారి ప్రసాద్, ఉపాధి హామీ ఏపిఓ రమేష్ , పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, సెర్ప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.