భూపాలపల్లిలో కాషాయ జెండా ఎగురవేస్తాం - చందుపట్ల కీర్తి రెడ్డి

భూపాలపల్లిలో కాషాయ జెండా ఎగురవేస్తాం - చందుపట్ల కీర్తి రెడ్డి

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తామని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ, జూకల్, తిరుమలాపురం, చిట్యాల గ్రామాల్లో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా చల్లగరిగ గ్రామంలోని రామాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం ఎంత పవిత్రమైనదో స్థానిక రామాలయం కూడా పురాతన ఆలయం కావడం విశేషం అన్నారు. అందుకే స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. ప్రతి ఒక్కరు పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. అనంతరం గ్రామాల్లో పాదయాత్రన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివరించారు. అనంతరం జూకల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్, మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగపూరి రాజమౌళి గౌడ్, నాయకులు వెన్నంపల్లి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.