మేడిగడ్డ బ్యారేజీ వద్దకు మీడియాకు నో ఎంట్రీ..

మేడిగడ్డ బ్యారేజీ వద్దకు మీడియాకు నో ఎంట్రీ..
  • పోలీసుల భారీ బందోబస్తు..
  • అడుగడుగునా తనిఖీలు..
  • అంబటిపల్లి క్యాంపు వద్దనే మీడియా పాయింట్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు మీడియాను అనుమతించడం లేదు. దీంతో న్యూస్ కవరేజీ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులు అసంతృప్తికి లోనవుతున్నారు. మేడిగడ్డ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి, అడుగడుగునా తనీఖీలు నిర్వహిస్తున్నారు.

ముఖ్యమైన ప్రజాప్రతినిధులు మినహా ఎవరిని అనుమతించడం లేదు. ఇంజనీరింగ్ అధికారులు మీడియాకు బ్యారేజీ వద్దకు అనుమతి లేదని చెప్పి అంబటిపల్లి క్యాంపు కార్యాలయం వద్దనే మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. దీంతో కేవలం ప్రెస్ మీట్ కే అవకాశం కల్పించినట్లయింది. మంత్రులు పరిశీలించే ప్రదేశాలను కవరేజ్ చేయకుండా ఆంక్షలు విధించడంతో మీడియా ప్రతినిధులు అసంతృప్తికి గురవుతున్నారు.